మన్యం టీవీ, కొత్తగూడెం,జూలై 19:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం,లక్ష్మీదేవి పల్లి మండలం లో గల ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు కరోనా బారిన పడటంతో వారి కుటుంబానికి భోజనాలు నిత్యావసర సరుకులు కూరగాయలు ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందించారు.
ఈ సందర్భంగా హరీష్ రత్నకుమారి మాట్లాడుతూ
లాక్ డౌన్ అయిపోగానే కరోనా అయిపోయిందని అనుకోవద్దు, కరోనా ఇంకా మన మధ్య లోనే ఉంది, కరోనా బారిన పడిన కుటుంబాలు చాలా ఉన్నాయి, మనకు తోచిన సహాయం అందిస్తే వారు ఇబ్బంది పడకుండా ఉంటారు,అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్కులు ధరిస్తూ అవసరమైతేనే బయటికి కానీ ఫంక్షన్లకు గాని వెళ్లాలి , ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉంటాము, తప్పనిసరిగా గోరువెచ్చని నీరు తాగుతూ పౌష్టిక ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉండాలని
ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మహిళా సమాఖ్య నాయకురాలు కరిష రత్నకుమారి, తెలియజేశారు ఈ కార్యక్రమంలో ధనమ్మ , పాల్గొన్నారు.
Post A Comment: