CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం..

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు,

జూలై 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పదవీకాలం ముగియడంతో నూతన అధ్యక్షులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా మండలంలోని పార్టీ నాయకులు, ప్రస్తుత, మాజీ, ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో, సమావేశమై వారి అభిప్రాయాలను, సూచనలను, అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మండలంలో అందర్నీ కలుపుకు పోతూ అందరి సహాయ సహకారాలతోటి ఐకమత్యంగా ఉన్నామన్నారు. పార్టీలో చాలా మంది యువకులు పార్టీ తొలినాళ్ళనుండి ఎంతో కష్టపడుతూ పార్టీకి వారి సేవలును అందిస్తున్నారని అన్నారు. అలాంటివారికి తగిన గుర్తింపును, హోదాను కల్పిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. మనమంతా కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్ష ఎన్నిక విషయంలో మీ అందరి అభిప్రాయాలను, సూచనలను, దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకుపోయే, వ్యక్తిని అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేస్తానని అన్నారు. దానికి కొంత సమయం పడుతుందని, మీరంతా సహకరించి నా నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఏది ఏమైనప్పటికీ జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎంపిక ఒక ప్రాధాన్యతను సంతరించుకొని, మండలంలో చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు ఎమ్మెల్యే రాములు నాయక్ తెర దించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్పిటిసి భూక్యా కళావతి, బొర్ర రాజశేఖర్, టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు చౌడం నర్సింహరావు, ఎంపీటీసీలు పొన్నెకంటి సతీష్ కుమార్, దుద్దుకూరు మధుసూదన్ రావు, సర్పంచులు, గలిగే సావిత్రి, లక్ష్మి, భూరం వెంకటలక్ష్మి, కిషన్ లాల్, పార్టీ నాయకులు వేల్పుల నరసింహారావు, కాజా రమేష్, పొన్నెకంటి వీరభద్రం, రామిశెట్టి రాంబాబు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: