మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇల్లందు సింగరేణి 24 ఏరియా క్రీడా మైదానం వేదిక వద్ద కొన్ని రోజులుగా ఆ చేతన స్థితిలో ఉన్న వృద్ధురాలు లక్ష్మి (65) స్థానిక యువకులతో తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇల్లందు పట్టణానికి చెందిన లక్ష్మి 2 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు కూడా ఎవరూ లేరు. ఉన్న ఇల్లు పాడి పడిపోవడంతో ఇల్లు విడిచి రావడంతో తో కొందరు ఇల్లుని కబ్జా చేశారు. తన దగ్గర ఉన్న డబ్బులు 5000 వేలు ఓ మహిళకు ఇచ్చినట్లు చెప్పారు. తన మేనకోడలు తాను మంచిగా ఉన్నప్పుడు చూసేందుకు వచ్చేదని దీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు రావడం లేదని తెలిపింది. ఈమె పరిస్థితిని క్రీడామైదానంలో చూసిన క్రీడాకారులు అన్నం శ్రీనివాసరావు కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించి అన్నం జోరు వానలో ఆమెను తన ఆశ్రమానికి తరలించారు. ఈ కార్యక్రమంలో క్రీడా మైదానంలో ఉన్న క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: