మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం గ్రామానికి చెందిన భూక్య మంగీలాల్ (28) వారం రోజుల క్రితం భార్య అనారోగ్యానికి గురి కావడంతో కొత్తగూడెంలోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించి ఇంటికి తీసుకుని వెళ్లి, మరల మందులు అవసరం కావడంతో మంగీలాల్ కొత్తగూడెం కి వెళ్లి తిరిగి రాలేదు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గరిమెళ్ళ పాడు గ్రామ శివారు అడవి ప్రాంతంలో వ్యక్తి మృతదేహం ఉండటంతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారం, ఇల్లందు మండలం పోచారం గ్రామానికి చెందిన భూక్య మంగీలాల్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలు చూసి ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే కొత్తగూడెం చేరుకున్నారు. టూ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: