CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వచ్ఛ పాల్వంచే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నాం - ఎం.ఎల్.ఏ వనమా వెంకటేశ్వరరావు

Share it:

 



మన్యం టీవి పాల్వంచ:- పాల్వంచ పట్టణాన్ని పారిశుద్యం లేకుండా, స్వచ్ఛ పాల్వంచే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నామని *కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు* అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో 80 లక్షల రూ"ల వ్యయంతో మంజూరు అయిన *స్వీపింగ్ మిషన్* ను సోమవారం *వనమా* ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో *వనమా* మాట్లాడుతూ పాల్వంచ పట్టణాన్ని పారిశుద్యం రహితంగా పనులు చేపట్టామన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన *స్వీపింగ్ మిషన్* ద్వారా అపరిశుభ్రంగా ఉన్న రోడ్ల మీద చెత్త చెదారాన్ని తొలగించి, వాటర్ స్ప్రే ద్వారా రోడ్లను పరిశుభ్రంగా ఉంచవచన్నారు. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో 30 ట్రాలీ ఆటోల ద్వారా తడి చెత్త, పొడి చెత్తను ఇంటింటికి తిరిగి పోగు చేసి, డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నామన్నారు. తడి చెత్త ద్వారా ఎరువులు, పొడి చెత్త ను రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు. 10 ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ యార్డ్ లకు పంపిస్తున్నామన్నారు. 100 మంది పారిశుధ్య కార్మికుల ద్వారా చెత్తను నిర్ములిస్తున్నామన్నారు.


ఈ కార్యక్రమంలో *తెరాస రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్, డి.ఈ మురళి, ఏ.ఈ రాజేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ వాణి కుమారి, తెరాస నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, మేదరిమెట్ల వెంకటేశ్వరరావు, మల్లెల శ్రీరామ్మూర్తి, కాల్వ భాస్కర్ రావు, కొత్తపల్లి సోమయ్య, ఏనుగుల శ్రీను, పుప్పాల సత్యం, హబీబ్, బొందిలి రాంబాబు, లింగమనేని సురేష్* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: