చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
అడివి బిడ్డలకు అండగా ఉంటూ నిరంతరం వారికి వైద్య సేవలందిస్తూ, పలువురు ప్రముఖుల నుంచి శభాష్ అనిపించు కుంట్టున్నారు ఏఎన్ఎం సుజాత, వివరాల్లోకి వెళితే చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సుమారు 30 గొత్తికోయల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి వారి వద్దకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోవడం పూర్తిగా అడవి మార్గం కావడంతో గుత్తికోయలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ వర్షాకాలం కావడంతో వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నందున వారి బాధను గుర్తించిన ఏఎన్ఎం సుజాత , రవాణా మార్గం లేకపోయినప్పటికీ, అడవి మార్గం బురదలో నడుచుకుంటూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడున్న గుత్తికోయల అందరికీ వైద్య సేవలు నిర్వహించారు. వారికి కావాల్సిన మందులను అందజేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, ,టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వర్షాకాలంలో చాలా వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటారని అడవిలో నివాసం ఉండే వారికి రవాణా మార్గం లేక సీజనల్ వ్యాధులు సంక్రమించి నప్పుడు వారికి అవగాహన లేక అడవి నుంచి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారని అలాంటి ఇబ్బందులు చూడలేక తాను తన సిబ్బందితో కలిసి అడవి మార్గంలో నడిచి వెళ్ళి వారికి కావలసిన వైద్య సేవలు అందించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని. నా వృత్తి ధర్మం లో నా వంతు బాధ్యత నిర్వహిస్తున్నామని ఆపదలో ఎవరున్నా తాను వెంటనే స్పందించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు.
Post A Comment: