సోలార్ లైట్ పంపిణీ...
మాన్యం మనుగడ దుమ్ముగూడెం: మండలం మన గట్టు గ్రామంలో సోలార్ లైట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది .విశిష్ట అతిథిగా దుమ్మగూడెం సిఐ , బెటాలియన్ స్పెషలాఫీసర్ విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దుమ్మగూడెం సీఐ మాట్లాడుతూ కనీసం రోడ్డు, విద్యుత్ లేని మారుమూల మాన గట్టు గ్రామంలో సోలార్ లైట్లు పంపిణీ చాలా శుభపరి నామంగా అభివర్ణించారు. సేవా భారతి, వనవాసి కళ్యాణ పరిషత్ వారి యొక్క సేవలను కొనియాడారు.మునీశ్వర్ మాట్లాడుతూ వనవాసి కళ్యాణ పరిషత్, సేవాభారతి చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆవుల సుబ్బారావు మాట్లాడుతూ వారసత్వంగా వస్తున్న మన యొక్క పండుగలు, భాష, సంస్కృతి భావితరాలకు అందించాలి అని తెలియజేశారు. వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా మహిళా ప్రముఖ పెద్దాడ ఆశలత వ క ప వారు ఆ గ్రామంలో గతంలో చేసిన కార్యక్రమాలు గుర్తుచేస్తూ వనవాసి కళ్యాణ పరిషత్తు సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో మడకం భారతి దగ్గరుండి పర్యవేక్షిస్తు ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ నరేష్ , సేవాభారతి ప్రచారక్ మునీశ్వర్ , సేవా ప్రముఖ ఆవుల సుబ్బారావు , ఎర్రం రాజు , బట్టిగూడెం సర్పంచ్ సీతారాములు , డాక్టర్ జగన్ ,వ క ప జిల్లా సంఘటన మంత్రి కోరం సూర్యనారాయణ , ప్రకాండ ప్రముఖ సున్నం రాజేష్ , నిలయ ప్రముఖ్ గొంది శోభన్ బాబు వ క ప కార్యకర్తలు పెద్దాడ ఆనంద్ కోరం ధర్మరాజు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: