శాస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు
గుండాల జూలై 1 (మన్యం టీవీ) ప్రజలకు అండగా నిలుస్తూ పలువురి ఆదరాభిమానాలను త్వరగా ఉంటున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. శాస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయిస్తూ ఆర్థికంగా వారికి తోడు పడుతున్నాడు. గుండాల మండలంలో శాస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి మొత్తం రెండు లక్షల 52 వేల రూపాయల చెక్కులు మంజూరు కాగా వాటిని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, పి సుధాకర్ ఇంటింటికి తిరుగుతూ చెక్కులను అందజేశారు. అనంతరం మోకాళ్ళ వీరస్వామి మాట్లాడుతూ. ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధితుల పట్ల బాసటగా నిలుస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు అన్నారు
Post A Comment: