👉రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
గడ్డం వీరన్న,గుండాల మన్యం మనుగడ ప్రతినిధి
మన్యం మనుగడ, గుండాల:
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 8 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శనివారం గుండాల మండలం లోని గుండాల నుండి పస్రా వెళ్లేందుకు మల్లన్న వాగుపై 4.5 కోట్లతో నిర్మించిన హై లెవల్ వంతెన, నర్సాపురంలో 2.57 కోట్లతో మల్లన్న వాగుపై నిర్మించిన చెక్ డాం, గుండాల, కాచనపల్లి గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వం విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు మాలోతు కవిత, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పి చైర్ పర్సన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం గుండాల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు పట్టణాలు పరిశుభ్రతను సంతరించు
కున్నాయని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్లేషణ చేశామని ఆయా రాష్ట్రాల్లో పింఛన్ 500, గ్రామాలు బాగు చేసుకోవడానికి కార్యక్రమాలు లేవని, రైతు బంధు, రైతు బీమా వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. ప్రసవాలు నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే వేలకు వేల రూపాయలు చెల్లించలేని పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రసవాలు జరగాలని కెసిఆర్ కిట్టు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, దాని ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో బిందెలు, కుండలు నెత్తిన పెట్టుకొని మంచినీటి కోసం ఆడబిడ్డలు బోరు బావులకు వెళ్లే స్థాయి నుంచి విముక్తి కలిగించేందుకు 40 వేల కోట్ల రూపాయలతో గోదావరి, కృష్ణ నదుల నుండి సురక్షిత తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు సురక్షిత మంచినీటి తాగుతున్నారని ఆయన తెలిపారు. గతంలో విద్యుత్ సరఫరాలో అనేకమైన ఇబ్బందులు పడ్డామని అటువంటి పరిస్థితి నుంచి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి వచ్చామని ఆయన తెలిపారు. గుండాల మండలంలో 2 వేల మందికి నెల 8.40 రూపాయలు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీలకు ప్రతినెల 300 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామపంచాయతీలో నిధులు లేక కొట్లాడుకునే స్థాయి నుంచి నేడు నిధులు నిల్వ ఉంచుకునే స్థాయికి చేర్చబడిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని ఆయన తెలిపారు.
36 మంది ప్రజలున్న అతి చిన్న పంచాయతి దొంగతోగుకు ప్రతి నెల సకాలంలో నిధులు మంజూరు చేస్తున్నామని ఆయన సూచించారు. వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని చెప్పారు. 481 గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటి నుండి తడి, పొడి వ్యర్దాలు సేకరణ జరగాలని, వాటి నుండి వర్మీ కంపోస్టు తయారు చేయాలని చెప్పారు. అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించేందుకు వైకుంఠ గ్రామాలు వినియోగించాలని చెప్పారు. డంపింగ్ యార్డ్ లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన వ్యర్దాలు నుండి వర్మి కంపోస్టు తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఈ పాఠశాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్వ విద్యార్థులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఆయన తెలిపారు. గుండాల గ్రామపంచాయతీలో సిసి రోడ్ల నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కరోనా వల్ల దేశ విదేశాల్లో సైతం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ జాప్యం చేయకుండా రైతుబంధు నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వము వైద్య కళాశాలను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. వరంగల్ లో రెండు వేల కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టామని దీని ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ 12 వేల పై చిలుకు గ్రామాల్లో పచ్చదనం పారిశుద్ధ్య కార్యక్రమాలు పెంపొందించేందుకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగినట్లు ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతనంగా ఏర్పాటు జరిగినప్పటికీ అభివృద్ధిలో దూసుకుపోతూ నేడు కళకళలాడుతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను విభజించి పరిపాలన వికేంద్రీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని, నేడు ఆ ఫలితాలు చూస్తున్నామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రాధాన్యతను గుర్తించి తొమ్మిది వేల గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్మించామని ఆయన తెలిపారు. ఖమ్మం నుంచి గుండాల వరకు దారి పొడుగునా ఎటువైపు చూసినా మొక్కలతో ఆహ్లాదకరంగా పచ్చగా పరిఢవిల్లుతున్నదని ఇదే స్ఫూర్తిని కొనసాగించి గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రత లను కొనసాగించాలని చెప్పారు. గ్రామపంచాయతీలలో జనాభా దామాషా ప్రకారం ప్రతినెల 300 కోట్లు నిధులు మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో వ్యర్థాల సేకరణ మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రమని చెప్పారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠ దామం, పల్లె ప్రకృతి వ వనాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నేడు ప్రతి గ్రామంలో ఈ మూడు ఏర్పాటు జరిగినట్లు ఆయన వివరించారు. మంచినీళ్ల కోసం పోరాడు స్థితి నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా 24 గంటలు వ్యవసాయంతో పాటు గృహాలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని సూచించారు. ఈ సీజన్లో మన్యంలో వ్యాధులు ప్రబలడంపై మన్యంలో మంచం పట్టిన వైద్యం అని వార్తలు వచ్చాయని, పల్లె ప్రగతి
కార్యక్రమమ్ ద్వారా నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గ్రామాలు పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న బోరు బావులు పూడ్చడం తో పాటు మురుగు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నిధులు మంజూరులో విప్ రేగా కాంతారావు ముందు ఉంటారని ఆయన తెలిపారు. అటవీ ప్రాంతాల్లో చెక్ డాం లు నిర్మాణం వల్ల నీటి లభ్యతతో పాటి భూగర్భ జలాలు పెంపొందించడానికి అవకాశం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతమైన పినపాక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మీడియా భాగస్వామ్యం పట్ల మంత్రి అభినందించారు. కరోనా సమయంలో వైద్య, అంగన్వాడీ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, మీడియా సేవలను మంత్రి అభినందించారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఆగమ్యగోచరంగా ఉన్నాయని అపరిశుభ్రత వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇటువంటి పరిస్థితి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన మహత్తరమైన కార్యక్రమమే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున చేసుకున్నామని ఆయన సూచించారు. ఆరోగ్యవంతమైన గ్రామాలుగా అభివృద్ధి సంక్షేమమే స్వర్ణయుగంగా చేపడుతున్నామని, ప్రపంచ దేశాలు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్న సమయంలో కూడా మొక్కవోని దీక్షతో ప్రజలు సురక్షితను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడిన సంక్షేమ అపలేదని చెప్పారు. ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమని ఆయన సూచించారు. ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొనేందుకు కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. ప్రజలు సహకరించాలని కరోనా పూర్తిగా తగ్గే వరకు సహకరించాలని ఆయన సూచించారు. ప్రజలను కాపాడటంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ ముందు ఉంటారాణి శ్రమించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దేవుళ్ళు తర్వాత దేవుళ్ళు మీరందరని ఆయన వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. నియోజకవర్గంలో అటవీ శాఖ అనుమతులు రాక పోవడం వల్ల
రహదారుల నిర్మాణం పనులు జరగడం లేదని అనుమతులు లభించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. మారుమూల గ్రామాల ప్రజలు ఏనాడూ గోదావరి నీళ్లు తాగుతామని కలలో కూడా
అనుకోలేదని కానీ నేడు 40 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి చిన్న గ్రామపంచాయతీలోని ప్రజలు సురక్షిత మంచినీరు తాగుతున్నారని ఈ ఘనత ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. 200 కోట్లతో అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీర్చేందుకు త్రీఫేస్ విద్యుత్తు లైను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మండలాల్లో గిరి వికాస పథకం ద్వారా బోర్వెల్స్ నిర్మాణం జరిగిందని విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని విద్యుత్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మొదటిరోజు పాదయాత్ర నిర్వహించి గుర్తించిన అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత మాట్లాడుతూ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా నేడు గ్రామాలు పట్టణాల్లో స్వచ్ఛతను సంతరించుకొని వ్యాధుల నుంచి ప్రజల కాపాడుకునే స్థాయికి వచ్చామని ఆమె సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేయటం ఎంతో అభినందనీయమని ఆమె తెలిపారు. గుండాల మండలానికి వంతెనలు మంజూరు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గంలో ఏకలవ్య మోడల్ స్కూల్ మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల ఆమె అభినందనలు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ కోరం సీతారాములు అధ్యక్షతన జరిగిన పల్లె ప్రగతి ముగింపు గ్రామసభలో జిల్లా కలెక్టర్ అనుదీప్, జడ్పి చైర్ పర్సన్ కోరం కనకయ్య, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీపీ సత్యం,
జెడ్ పి టి సి రామక్క, ఎంపీటీసీ సంధాని, గ్రామ కార్యదర్శి సురేష్, రైతు సమితి కన్వీనర్ బాపయ్య, ఎంపీడీవో
ఎమ్మార్వో రమేష్,
ఎం డి ఓ కృష్ణయ్య అటవీశాఖ అధికారి మురళి, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: