గుండాల జూలై 4 (మన్యం టీవీ) దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ముక్తి సత్య మాట్లాడుతూ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించే వాళ్లే నిజమైన కమ్యూనిస్టులను అన్నారు. కాచన పల్లి తో పాటు ముక్తాపురం గుండాల కొడవటంచ తదితర గ్రామాల్లో నిర్వహించామన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో నరేంద్ర మోడీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కెసిఆర్ దళిత సాధికారిత పేరుతో జిల్లాలో పర్యటించాలని చూస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమిని మాత్రం అందించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు రవి , సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్, ఈ సం కృష్ణ , పూనెం రంగయ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: