మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఐటీడీఏ ముప్పు,లోతట్టుగ్రామాల్లోపరిస్థితులు,తీసుకోవాల్సిన చర్యలు పైన సమీక్ష సమావేశం ఐటీడీఏ పిఓ హన్మంతు కె జెండగే అధ్యక్షతన ఏర్పాటు చేయగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఇంటెర్రీగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఏటూరునాగారం మండల కేంద్రంలో అన్ని రోడ్లు, డ్రైనేజీ, సమీకృత ప్రణాలికలతో శాశ్వత అభివృద్ధి పరిష్కారం కోసం 50 కోట్లు మంజూరు చేయాలని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్
శ్రీమతి సత్యవతి రాథోడ్ మంత్రి ని కోరారు.
తక్షణమే స్పందించిన మంత్రులు సత్యవతి రాథోడ్ 50 కోట్ల మంజూరు చేస్తాను అని హామీఇస్తూ ఐటీడీఏ ఏఈ హేమలత కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని ఆదేశించారు. ఈయొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య,అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి,జిల్లా రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,జిల్లా కోప్షన్ నెంబర్ వాలియాబీ సలీమ్,పోరిక గోవింద్ నాయక్,ఆత్మ చైర్మన్ ఏటూరునాగారం దుర్గం రమణయ్య,ఎంపీపీ అంతటి విజయ, టిఆర్ఎస్ మండల పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,తుమ్మ మల్లరెడ్డి,తాహిర్ పాషా,
కృష్ణ రెడ్డి,పిఎసియస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,రామన్న గూడం సర్పంచ్ దొడ్డ కృష్ణ,ఎంపీటీసీ అల్లి సునీత శ్రీనివాస్,తెరాస పాకునూరు మహేష్,కుమ్మరిచంద్రబాబు,
సప్పిడి రామ నర్సయ్య,కోమిరె రమేష్,వావిలాలరాంబాబు,
ఎండి ఖాజా పాషా,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: