మన్యం టీవీ, అశ్వరావుపేట: అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పుజరి సుధారాణి కుమార్తె హేమలత అనారోగ్యంతో బాధపడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సోషల్ మీడియా, వార్త ప్రచురణలు ద్వారా విషయం తెలుసుకున్న చిట్టితల్లి సేవాసమితి వ్యవస్థాపకులు మరియు నారం వారిగూడెం సర్పంచ్ మనగొండ వెంకట ముత్యం వేదాంతపురం గ్రామానికి చేరుకొని వేదాంతపురం సర్పంచ్ సోమిని శివప్రసాద్ అద్వర్యం లో బాధితురాలికి 50 వేల రూపాయలు సహాయం చేస్తానని హామీ, ఇచ్చి తక్షణ సహాయంగా 13 వేల రూపాయలు బాధితులకు అందించారు. అదేవిధంగా చిట్టి తల్లి సేవ సమితి ద్వారా వెలువడిన ఆంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి ఉచితంగా పంపిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టితల్లి ఆంబులెన్స్ డ్రైవర్ బాజీ బాబా, ముళ్ళపూడి చలపతి, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, ఆళ్ల సత్యనారాయణ, చెమట బోయిన సురేష్, వేముల శ్రీను, రాజు, రవి శేఖర్, నారం పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: