CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుండెపుడి గ్రామపంచాయతీ లో 4వ విడత "పల్లె ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని గుండెపుడి గ్రామపంచాయతీ లో 4వ విడత "పల్లె ప్రగతి" కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మొక్కలు నాటి ప్రారంభించారు. అనంతరం 4వ విడత "పల్లె ప్రగతి" గ్రామ సభలో పాల్గొన్నారు. వివిధ శాఖల ప్రగతి నివేదికలను సంబంధిత శాఖ అధికారులు గ్రామ సభ ద్వారా తెలియపరిచారు. పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో సంవత్సరం క్రితం పేదలకు పంచిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో అంతర్గత రోడ్లు, కరెంటు, త్రాగునీరు, సమస్య ఉందంటూ తమ దృష్టికి తీసుకొని వచ్చినప్పటికీ నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదని వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని మాజీ వైస్ ఎంపీపీ సీతాకుమారి గ్రామ సభ ద్వారా కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ముఖ్యంగా రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరాపెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, లాంటి పధకాలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి అన్నారు. రానున్న కాలంలో నా సొంత మండలమైన జూలూరుపాడు లోని అన్ని గ్రామ పంచాయతీల లో ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారావు, ఎంపీపీ సోనీ, జెడ్పిటిసి కళావతి, వైస్ ఎంపీపీ నిర్మల, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: