అగ్రకులహంకారనికి కారంచేడు ఘటన పరాకాష్ట
-రాజమల్ల సుకుమార్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా సభ్యులు.
మన్యం టీవీ మంగపేట.
భూస్వాముల పాశవికంగా స్త్రీలను బట్టలు చింపి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి,పోత్తికడుపుల మీద కర్రలతో పొడిచి,గర్భిణీలను కాళ్లతో తన్ని,అత్యంత దారుణంగా అత్యాచారం చేసి తమ కులాహంకారాన్ని అత్యంత పైశాచికంగా ప్రదర్శించిన రోజు ఇది.
ముసలివాళ్ళు,యువకులు అనే తేడా లేకుండా గొడ్డళ్లతో తలలు నరికి,బరిసెలతో పోత్తికడుపుల్లో గుచ్చి పేగులు బయట పడితే
భూస్వాములు,రాజకీయ నాయకులమైన మాకు ఎదురుతిరిగితే మా కాళ్ళకింద తొక్క బడతారు లేకపోతే తలలు తెగిన మొండాలై నరకబడతారు అని సజీవ సాక్ష్యాలను నిలబెట్టిన రోజు.
శవాలు ఉంటే గద్దలు, రాబందులు తిరుగుతుంటాయి వెతకనక్కర లేదు....అని పోలీసులే దగ్గరుండి హత్యాకాండకు వెన్నుదన్నుగా నిలబడి,పోలీస్ యంత్రాంగం ఎవరి చెప్పుచేతల్లో ఉంటుందో,ఎవరికి కొమ్ము కాస్తుందో నిగ్గు తేలిన రోజు.
కానీ ఈనాటికి కారంచేడులో రగిలిన జ్వాలలు మండుతూనే ఉన్నాయి....వారి నెత్తురుతో తడిసిన నేల ఇంకా తడి ఆరిపోలేదు.
జోహార్ కారంచేడు మృతవీరులకు.....
Post A Comment: