మన్యం టీవీ ఏటూరు నాగారం
ప్రజలకు సేవలు అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయి తేజ పిడ్ ది నిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏటూరు నాగారం ఐటిడిఏ పిఓ హనుమంతు కె జెండా గే కు రూ.3.50 లక్షల మందులను అందించారు. కొవిడ్ మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో మందులు అందించినట్లు సంస్థ ప్రతినిధి జగదీష్ తెలిపారు. సేవాభావంతో ప్రజలకు ఉచితంగా మందులు అందించడం అభినందనీయమని పిఓ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ డిప్యూటీ డి ఎం హెచ్ వో మంకిడీ వెంకటేశ్వరరావు, ఎం హెచ్ ఎం ప్రోగ్రాం మేనేజర్ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: