CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 సీతమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం 25 లక్షలు ఇవ్వాలి..

Share it:


👉నిర్వాసితుల అందరూ పోరాటానికి సిద్ధం కావాలి మాజీ ఎంపీ డాక్టర్ బాబురావు..





మాన్యం టివి దుమ్ముగూడెం: ఈరోజు దుమ్ముగూడెం మండలం లో ప్రగలపల్లి  గ్రామంలో లో సిపిఎం పార్టీ 6వ శాఖ మహాసభల్లో కామ్రేడ్ వెంకటనర్సయియ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ డాక్టర్  మీడియం బాబురావు మాట్లాడుతూ ప్రాజెక్టు వలన దుమ్ముగూడెం చర్ల అశ్వాపురం మణుగూరు 5 మండలాల సుమారు అరవై నాలుగు గ్రామాల్లో భూ నిర్వాసితులకు 25లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటి ప్రభుత్వం అధికారులు అందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం 25 లక్షల ప్యాకేజీ ప్రకటించి అప్పుడు మాత్రమే పనులు ప్రారంభించాలని లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. 2013 భూ నిర్వాసితుల పరిహారం ఇవ్వకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలని సుమారు 40 గ్రామాలకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన అన్నారు ఈ మహాసభకు పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు వంశీ  జిల్లా కమిటీ సభ్యులు చిలకమ్మ సీనియర్ నాయకులు శాఖ కార్యదర్శి ప్రభాకర్ ,లక్ష్మీనారాయణ నాగరాజు, శ్రీను, కృష్ణార్జున వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: