మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ఐటీసీ పి ఎస్ పి డి వారు భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు అవసరమైన సామాగ్రినీ కొంత యాజమాన్యం తరుపున అందించారు. కరోనా వైరస్ విజృంభణతో వైద్య సేవలు కోసం వస్తున్న వారి సంఖ్య పెరగటంతో అవసరానికి తగ్గట్టుగా వైద్య పరికరాలు బెడ్స్ ఇతర వస్తువులు అవసరం ఉండటంతో తమ వంతు సహాయంగా ఐటీసీ సంస్థ యజమాన్యం తరఫున 20 లక్షల విలువగల మెడికల్ కిట్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్లూరి, ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ్ మహంతి, జిఎం ప్రమోద్ కుమార్ పాత్ర,చంగాల్రావు, శ్యామ్ కిరణ్ హాస్పిటల్ సుపరింటట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: