విచ్చలవిడిగా వెలుస్తున్న పాట్లు.
మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 4:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ విచ్చలవిడిగా వెంచర్లు వేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ ఆరోపించారు.ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి భారత్ పబ్లిక్ స్కూలుకు వెనుక చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ పంచాయతీ పరిధిలో ఏజెన్సీ చట్టాలకు,పంచాయతీ రాజ్ చట్టాలకు విరుద్ధంగా వేసిన అక్రమ వెంచర్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్న అధికారులు మౌనం దాల్చడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు? ఇందులో అధికారులకు కూడా వాటాలు ముడుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని దానిని నివృత్తి చేసేందుకు తక్షణమే స్పందించి అక్రమంగా కొనసాగిస్తున్న రియల్ ఎస్టేట్ దందాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి,అసెంబ్లీ కన్వీనర్ బొంతు.కిరణ్, ధనుంజయ్,శివనంద్,శ్రవంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: