CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనకై 26,27 తేదీల ఛలో ఢీల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Share it:

 


  👉 మాదిగ జేఏసీ జిల్లా నాయకులు దేపంగి.వెంకటరమణ      

 మన్యం మనుగడ,అశ్వాపురం: మండలం లోని మల్లెమడుగు గ్రామంలోని డా.బి.ఆర్.అంబెడ్కర్ విగ్రహం దగ్గర మాదిగ జేఏసీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో దేపంగి.వెంకటరమణ మాట్లాడారు. యస్.సి.కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డా.పిడమర్తి.రవి నాయకత్వంలో మాదిగల 12% రిజర్వేషన్ల సాధనకై ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలోనే యస్.సి.వర్గీకరణ చట్టబద్ధతకై, మాదిగలకు 12% రిజర్వేషన్లు కలిపించాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీ లోని "జంతర్ మంతర్"* మరియు "పార్లమెంట్ స్ట్రీట్" లలో నిరసన దీక్షకు ఈ నెల 26,27 తేదీలలో ఛలో ఢీల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ శ్రేణులను, కార్యకర్తలను కొరినారు.100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో మందా. హుస్సేన్, ఈసంపల్లి.పున్నారావు, గొడ్ల. కృష్ణ, గాడిద. హరీష్, E.సాయి కుమార్, గద్దల.భాస్కర్, చందు, నవీన్,అఖిల్ తదితరులు పాలుగొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: