వివరాలు వెల్లడించిన మణుగూరు ఏ ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్
మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం బస్టాండ్ నందు మణుగూరు సిఐ భాను ప్రకాష్ సిబ్బంది తో కలిసి తనిఖీలు చేస్తుండగా,బస్సులో ప్రయాణిస్తున్న రాజమండ్రి కి చెందిన బంగారు.సుధీర్ గుప్తా అనే వ్యక్తి ఎటువంటి బిల్లులు లేకుండా రాజమండ్రి నుండి వరంగల్ తరలిస్తున్న రూ.12 లక్షల రూపాయల విలువ చేసే, సుమారు 22 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని,వాణిజ్యపన్నుల శాఖ కు సమాచారం ఇచ్చినట్లు మణుగూరు ఏ ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ భాను ప్రకాష్,పి.ఎస్ ఐ.వి.ఎన్.రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: