మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని వినోబానగర్ లో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జూలూరుపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి రఘు దీపిక తన సిబ్బంది స్థానిక పోలీసుల సహాయంతో నమ్మదగిన సమాచారం మీద వినోబానగర్ గ్రామంలో చప్పిడి శ్రీనివాస్ ఇంటిలో ఎటువంటి అనుమతులు లేకుండా, లైసెన్సులు లేకుండా ప్రభుత్వ నిషేధిత గ్లైపోసైడ్,హెర్భైసైడ్, అను పురుగుమందులను తన యొక్క గృహంలో పెట్టుకొని తన స్నేహితుడైన ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కూచిపూడి నరసింహారావు తో కలిసి అమాయక రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని వెంటనే పంచనామా నిర్వహించి 1120 లీటర్ల నిషేధిత గ్లైపోసైడ్,హెర్భైసైడ్, పురుగుమందుల విలువ 5,57,000 విలువగల మందులను, వాటిని తరలించడానికి ఉపయోగిస్తున్న మేడిపల్లి గ్రామానికి చెందిన పూనం శివ యొక్క టాటా ఏసీ ట్రాలీ ని సీజ్ చేయడం జరిగింది. చప్పిడి శ్రీనివాసు ను పూనెం శివ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్ తెలిపారు.
Post A Comment: