గుండాల ఆళ్ల పల్లి జూలై 13 (మన్యం మనుగడ) వన్ జీరో ఎయిట్ లో నే ప్రసవం చేసిన సిబ్బంది వివరాల్లోకి వెళితే ఆళ్ల పల్లి మండలంలోని రామాంజి గూడెం గ్రామానికి చెందిన మౌనిక కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వన్ జీరో ఎయిట్ సమాచారం అందించడంతో గుండాల నుండి రామంజి గూడెం వెళ్లిన వాహనం మౌనిక ను తీసుకొని ఆళ్ల పల్లి ప్రాథమిక వైద్యశాలకు తరలించగా డాక్టర్ కొత్తగూడెం రిఫర్ చేయడంతో వాహనంలో బయలుదేరిన మౌనిక అనిశెట్టి పెళ్లి వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలోని సిబ్బంది కాన్పు చేశారు. పాపకు మౌనిక జన్మనిచ్చింది. వన్ జీరో ఎయిట్ సిబ్బందిని కుటుంబ సభ్యులతో పాటు మండల ప్రజలు అభినందించారు. వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఈ ఎన్ టి సావిత్రి, పైలట్ ప్రవీణ్ ఉన్నారు
Post A Comment: