మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, విధి విధానాలకు ఆకర్షితులై నూతన పిసిసి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని,డిసిసి అధ్యక్షులు పొదేం.వీరయ్య, నాయకత్వాన్ని బలపరుస్తూ,కన్వీనర్ డాక్టర్ సంతోష్ కుమార్,కో కన్వీనర్ గురిజాల గోపి,వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో,రాజుపేట ఏరియా,శివలింగాపురం,ఉడతాని గుంపు,ప్రాంతాల నుంచి సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.వీరందరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా వింగ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నా యకులు గొల్ల.సాంబయ్య, సాంబ,రాములు,కాంగ్రెస్ మహిళా వింగ్ షబానా, నాగమణి,రజిని,సౌజన్య యువజన నాయకులు వేణు,సందీప్,పినపాక మండలం,యువజన నాయకులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: