మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం అన్నారం గ్రామంలో నిరుపేద కుటుంబమైనా దూలగొండి. సంధ్య కు పై చదువుల నిమిత్తం తన వంతుగా ఆర్థిక సహాయంగా రూ.10 వేల రూపాయలను పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు పద్ధం శ్రీనివాస్ వారి చేతుల మీదుగా విద్యార్థినికి ఆర్థిక అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ మీడియా ఇంచార్జ్ తాళ్లపల్లి యాదగిరి గౌడ్,నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ శ్యామ్ సుందర్,పినపాక మండలం టిఆరేస్వి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటీ సందీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్,మారోజు.రమేష్,ఎండి.ఆదామ్,బానోత్.రమేష్,మునిగల.సంతోష్,మహేష్,నజీర్ సోన్, కాట్రగడ్డ.సురేందర్,సాయి ప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: