🔆వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
మన్యం టీవీ,పాల్వంచ: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల జాతీయ పిలుపులో భాగంగా శనివారం స్థానిక అంబెడ్కర్ సెంటర్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సిపిఎం మండల కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి నిమ్మల రాంబాబు లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల నేడు దేశంలో రాష్ట్రంలో పేద మధ్య తరగతి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనికి తోడు కరోనా ప్రభావం వల్ల సామాన్య ప్రజలకు పనులు లేక ఉద్యోగాలు పోయి ఏమి చేయలేని దిక్కుతోచని స్థితిలో అర్ధాకలితో అలమటిస్తున్నారుని, కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాక్డౌన్ పేరుతో పాలకులు ఇబ్బడిముబ్బడిగా అన్ని రేట్లను పెంచి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తక్కువ ధరకే అమ్మేస్తూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తూ వారిని రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పాలకులు అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలపై ప్రశ్నిస్తున్న, పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ దేశద్రోహులు ముద్ర వేసి జైల్లో పెట్టి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పాలకులు మేలుకొని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని లేనిపక్షంలో ఈ దేశ ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. *ఈ కార్యక్రమంలో సిపిఐ మండలం కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, భాగం రాంప్రసాద్, జ్యోతుల రమేష్, సీపీఎం నాయకులు గూడుపూరి రాజు, ఎం ముత్తయ్య, ఆశాలు, సత్య, గట్టయ్య, సీపీఐ(ML) నాయకులు గోనెల రమేష్, వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, తాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: