CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెకు చేరువైన పల్లె వెలుగు బస్సు

Share it:

 


 

 తొలిసారి నడిగూడెం గ్రామం నుండి రాకపోకలు సాగిస్తున్నారు ఆర్టీసీ బస్సు

 గుండాల /ఆళ్ల పల్లి     (మన్యం టీవీ)పల్లెకు  చేరువైన పల్లె వెలుగు బస్సు ఇప్పటివరకు మర్కోడు గ్రామం వరకే పరిమితమైన పల్లె వెలుగు బస్సు గురువారం నుండి నడిగూడెం జాకారం  తదితర గ్రామాల నుండి రాకపోకలు సాగిస్తుంది. తొలిసారిగా పల్లెకు వచ్చిన ఆర్టీసీ బస్సును గ్రామస్తులు కొబ్బరి మాటలతో తోరణాలతో ముస్తాబు గా అలంకరించారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని  మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు, నడిగూడెం సర్పంచ్ కొమరం నరసింహారావు  రిబ్బన్ కట్ చేసి బస్సును  ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పల్లె వెలుగు బస్సు  మర్కోడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు రవాణా  సౌకర్యం లేక కాలినడకనే నిత్యం ప్రయాణించాల్సి వస్తుందని ఇప్పుడు  ఆ కష్టాల నుండి ప్రజలు గట్టెక్కారు అన్నారు. నిత్యం బస్సులు నడిపేందుకు అధికారులు చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా నడిగూడెం గ్రామానికి  బస్సు రావడంతో నడిగూడెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు  ,ఉపాధ్యక్షులు వేమూరి సత్యం  ,శ్రీనివాసాచారి  ,రేసు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: