- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆంధ్రా- తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల జాయింట్ క్రాస్ సెక్షనల్ సర్వేలో అంచనా వేసిన పరిణామాలను వారి సిఫార్సు లను ఇరిగేషన్ EE మరియు DE లను అడిగి తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదేం
మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
ఆంధ్ర రాష్ట్రం లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతున్నా సమయం లో భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలలో భయం మొదలయింది, మన ప్రస్తుత కరకట్ట మరియు స్ల్యూయిస్ వాల్స్ వరదను ఏమేరకు నిలువరిస్తాయనే విషయం లో సుదీర్గంగా MLA గారు అధికారులతో చెర్చించారు, గత సంవత్సరం వరదలు వచ్చిన సమయం లో ఎదురయిన సమస్యలను బట్టి ఈ సంవత్సరం మరల పునరావృట్టం కాకుండా చూడాలని దానికి సంబందించి నిలువ కు కొత్త మోటార్ లు కొనుగోలు చేసి రెడీ గా ఉంచుకోవాలని లీకేజీ ల ను అరికట్టడానికి ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, ముందుగానే లాంచ్ లు మాట్లాడుకుని అన్నీ అనుమతులతో సిద్ధంగా వుండే విధంగా చూడాలని ఆదేశించారు. అధికారులు ఈ 3నెలలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.భద్రద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారితో నిత్యం వరదలపై మాట్లాడుతున్నట్లు వారు కూడా ప్రతేకంగా శ్రద్ధ వహిస్తానని తెలియచేసినట్టు తెలిపారు.
Post A Comment: