మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. రొంపేడు పి హెచ్ సి పరిధిలోగల సత్యనారాయణపురం ఆరోగ్య ఉప కేంద్రం లో ఎమ్మెల్యే దోమతెరలు పంపిణీ చేశారు. మలేరియా ప్రభావిత గ్రామాలలో పంపిణీ చేస్తున్న దోమ తెరలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరోనా వచ్చి హోమ్ ఐసోలేట్ ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు, సొసైటీ చైర్మన్ కృష్ణను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో మరణించిన ఆత్మ కమిటీ చైర్మన్ వెంకన్న కుటుంబసభ్యులను, తెరాస యువజన నాయకుడు రాజశేఖర్ కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్, సర్పంచులు లలిత, వెంకటేశ్వర్లు, సురేష్, రేణుక, మాధవరావు, ప్రమోద్, రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: