మన్యంటీవీ, అశ్వారావుపేట:
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా అశ్వారావుపేట లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, ప్రొపెసర్ జయశంకర్ స్ఫూర్తి తో కెసీఆర్ పరిపాలనతో దేశంలోని రాష్ట్రాల తో పోలిస్తే అభివృద్ది లో తెలంగాణ రాష్ట్రం చాలా ముందంజ లో వుందని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కార్యాలయం సిబ్బింది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: