మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ లోని సందెల రామాపురం గ్రామంలో సర్పంచ్ కురసం వెంకట రమణమ్మ అధ్యక్షతన హెల్త్ డిపార్ట్మెంట్ వారు దోమతెరలు పంపిణీ కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పొడియం ముత్యాలమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దోమ తెరలను ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వాడుకోవాలి అని డెంగ్యూ,మలేరియా నుండి కాపాడుకోవాలని తెలిపినారు. ఈ యొక్క కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుండి హెల్త్ సూపర్వైజర్ ఏఎన్ఎంలు,ఆశా వర్కర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: