కదిలిన పేద కుటుంబాలు...
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని కాకర్ల రెవెన్యూ గ్రామ పంచాయతీ లో గల (అసైన్మెంట్) గవర్నమెంట్ భూమి సర్వే నెంబర్ 82 లో సుమారు 170 మంది అర్హులైన నిరుపేద కుటుంబాలకు (ఎస్సీ ) (బీసీ) లకు 1988 లో ఆనాటి జిల్లా కలెక్టర్ ఇండ్ల స్థలాలను కేటాయించి పట్టాలిచ్చారని, కానీ ఆనాడు మధ్యలో వాగు ఉండటం వలన రాకపోకలకు అనువుగా లేకపోవడంతో ఇతరేతర కారణాల వల్ల ఇల్లు నిర్మించుకో లేకపోయామన్నారు. అదే అదనుగా భావించిన కొందరు ఆక్రమణ దారులు అధికారులతో కుమ్మక్కై (అసైన్మెంట్) గవర్నమెంటు భూమిని పేద ప్రజలకు పంపిణీ చేసిన భూమిని గుట్టుచప్పుడు కాకుండా పట్టాలు చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గత వారం రోజులక్రితం దరఖాస్తు రూపంలో పై అధికారుల దృష్టికి తీసుకుపోయామన్నారు. కానీ అధికారులు మమ్మలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలను పట్టుకొని వారికి కేటాయించిన భూమిలో ఆదివారం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదలకు కేటాయించిన సుమారు నాలుగు ఎకరాల అసైన్మెంట్ భూమి ని గవర్నమెంట్ స్వాధీనపరచుకొని అందులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు అందజేయాలని వారు కోరారు.
Post A Comment: