మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని, కమలాపురం ఇందిరాకాలనీ లోని దూడపాక సారయ్య బార్యకు పక్షవాతం వచ్చి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మరియు వికలాంగురాలైన చెల్లెలు వారి ఆర్దిక పరిస్తితి బాగలేకపోవడంతో ముఖ్యంగా ఏ పి రెయాన్స్ ఫ్యాక్టరి మూతపడి ఏడు సం॥లు కావడంతో ఇంట్లో వారిని చూసుకునే దిక్కు లేక అటువారిని వదిలి ఏటూ పోలేక వారి పరిస్తితి అగ మ్యగోచరంగా మారింది. వారి కుటుంబానికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం రోజులు సరిపడా బియ్యం కూరగాయలు వంటసామాగ్రి మరియు 1000 రూపాయలు దాతలసహకారంతో ఇవ్వడం జరిగింది వీరికి ఆపద వచ్చినప్పుడు మన బాధ్యత గా ఇలాంటి వారిని కాపాడుకోవాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ కార్య క్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య గారు,మునిగాల రాకేష్,కళ్లెబోయిన సురేష్,తాటి అశోక్,ఏ బీ ఎన్ రిపోర్టర్ వడ్లకొండ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: