మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన గోగినేని ఎర్రమ్మ, ఆలూరి విద్యాధరరావు, అల్లం నేని పద్మ లు ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పార్టీపరంగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, టిపిసిసి కార్యదర్శి
పైడాఆకుల అశోక్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్, సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు ముద్ద బోయిన రాము, లక్ష్మీ జోగ నాయక్, సుక్యా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, చల్వాయి ఎంపిటిసి చాపల ఉమాదేవి, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు భూక్యా రాజు, ఎంపీటీసీ మా వురు రపు తిరుపతిరెడ్డి, కన్నాయిగూడెం మండలం వైస్ ఎంపీపీ బోల్లె భాస్కర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు తాటి రాజబాబు, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బు రమేష్, కృష్ణ, లక్ష్మి, కిరణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: