మన్యంటీవీ, అశ్వరావుపేట:
ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మండలంలో శుక్రవారం పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. మేనల్లుడు ప్రతాప్ మరణంతో బాధపడుతున్న అశ్వరావుపేట ఎంపిపి శ్రీరామ్మూర్తి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలసి పొంగులే శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. మృతుడు ప్రతాప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల అర్పించారు. ప్రతాప్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధపడవద్దు అని ధైర్యం చెప్పారు. ఇటీవల మృతి చెందిన మల్లు బాబు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దిశాకమిటీ చైర్మన్ జూపల్లి రమేష్, డిసిసిబి సెంట్రల్ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఎంపీపీ జల్లిపల్లి శ్రీ రాంమూర్తి, జడ్పిటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, జిల్లా మహిళా సభ్యురాలు బానోత్ పద్మావతి, సర్పంచ్లు అట్టం రమ్య, కునుసోత్ లింగయ్య, కొడిమె సీత, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, ఎంపీటీసీలు వల్లెపు తిరుపతిరావు, నాయకులు అల్లు వెంకటరామారావు, పసుపులేటి రాము, జూపల్లి ప్రమోద్, పల్లెల రామలక్ష్మయ్య, జన్మాల శ్రీకాంత్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: