మన్యం మనుగడ పినపాక: పినపాక మండలం వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కరోనా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం నాడు జానంపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నాలుగు పల్స్ ఆక్సి మీటర్ల ను అందజేయడం జరిగింది. అదేవిధంగా పినపాక మండల విలేకరులకు ఆరు ఆక్సీ మీటర్లను అందజేయడం జరిగింది.
ఈ సేవను ఐటీ సర్వ్ అలయన్స్ ఎన్నారై వారి సహకారంతో చేస్తున్నామని వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శృతి, పినపాక మండల విలేకరులు పాల్గొన్నారు
Post A Comment: