మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్,మణుగూరు ఏరియా పీకే ఓసి-2 డంపర్ సెక్షన్ బేస్ వర్క్ షాప్, ఇంజనీర్లు దాసరి రాజశేఖర్ ఎస్ ఈ,కే సుదర్శన్ రెడ్డి ఎస్ ఈ మరియు కార్మికులు ఎల్ నరేష్,అత్తులూరి రవీందర్ ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బండారు గూడెం లోని లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ,రోడ్ల పక్కన కూరగాయలను అమ్ముకునే పలువురు మహిళలకు బియ్యం నిత్యవసర వస్తువులను వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు రాజశేఖర్,సుదర్శన్ రెడ్డి లు మాట్లాడుతూ చిరు కూరగాయల వ్యాపారుల కష్టాలను పత్రికల్లో చూసి తాము స్పందించామని కరోనా కష్టాలు తీరాలని వారి బతుకుల లో వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు గుండాల ఉపేందర్,సయ్యద్ నాసర్ పాషా,చిరు కూరగాయల వ్యాపారుల సంఘం అధ్యక్షులు మెండు సాగర్,చిరు వ్యాపారులు టీ ఉమ,చిలకమ్మ, సుజాత, రాధమ్మ,లింగమ్మ,జయమ్మ,రమాదేవి,కరుణ,సువర్ణ, మంగమ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: