మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట పట్టణం లో ఏఐసిసి, టిపిసిసి అదేశాలతో పెంచిన పెట్రోల్, డీజీల్ తగ్గించాలని పెట్రోలు బంక్ దగ్గర మండల కాంగ్రేస్ ప్రెసిడెంట్ మొగళ్లపు చెన్నకేశవరావు అధ్యక్షతన, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి నిరసన కార్యక్రమము లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సున్నం నాగమణి మాట్లాడుతు పెంచిన పెట్రోలు, డీజీల్ ధరలు వెంటనె తగ్గించాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. కరోనా వల్ల ప్రజలు తివ్ర ఇబ్బందుల్లో ఉంటే పెట్రోలు, డీజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతూనే ఉంది, గత 13 నెలల్లో లీటరు పెట్రోలు పై ₹25.72., డీజీల్ పై ₹23.93. మేరకు దరలు పెంచడం దారణమని సున్నం నాగమణి మండిపడ్డారు. ప్రజా దోపిడీకి ఇదే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమము లో ఎంపీటీసీ వేముల భారతి, సి సత్యవరపు అనసూర్య ఎం.పి.టి సి, ఎస్ కె.పాష మండల కో ఆప్సన్ మెంబర్, ఎస్ .కె.బాబా మండల మైనారటీ ప్రెసిడెంట్, ఛిన్నంశెట్టి రామకృష్ణ, ముళగిరి కృష్ణ, శివరామరాజు నడింపల్లి, బండారి మహేషే, వేముల ప్రతాప్, శివకాశి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: