👉ఉపాధ్యాయులపై పర్యవేక్షణ ఉంచాలి
👉 విద్యార్థులకు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలి ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్
గుండాల /ఆళ్ల పల్లి (మన్యం టీవీ)కరోనా సమయంలో పాఠశాలలు నిర్వహించడం ఎంతవరకు సాధ్యపడుతుందని ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షుడు మండలొజు ప్రశాంత్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ. కరోనా ఈ సమయంలో విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు కరోనా బారిన పడే ప్రమాదముందన్నారు . విద్యార్థులకు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాక పాఠశాలల నిర్వహణ చేపడితే బాగుంటుందని అన్నారు. కరోనా మూడో దశ ముంపు కొంచెం వున్నందున హై స్కూల్ నిర్వహణ చేపడితే బాగుంటుందని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేనందున వాటిని చేపట్టి పాఠశాల లు ప్రారంభిం చాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు పాఠశాలలో గదులన్నీ శానిటేషన్ తప్పనిసరిగా చేసే విధంగా అధికారులను ఆదేశించాలని అన్నారు. ఉపాధ్యాయులు మామూలు సమయంలోనే విధులకు సక్రమంగా హాజరు కాగలరని కరోనా సమయములో కుంటి సాకులు చెప్పి విధులకు డుమ్మా కొడతారా అన్నారు విద్య ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు వచ్చే విధంగా ఉన్నత అధికారులు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోకల మహేష్ ,నాయకులు నరెడ్ల సందీప్ ,తులం నాగరాజు ,కందిమల్ల సాయి ,శ్రీ రామ్ హరీష్ ,సాగర్ ,కొమ్ము మహేష్ ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: