*సంస్థ ప్రతినిధులను అభినందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగ లంచ గుత్తి కోయ గూడెం లో హన్మకొండ కు చెందిన ఈఫ్కో టోకీయో జనరల్ ఇన్స్ రేన్స్ వారి సహకారం సుమారు లక్ష రూపాయలు విలువ గల నిత్యావసర సరుకులు వారి ఒక నెల జీతం లో నుండి 60 గుత్తి కోయ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం,పప్పులు,నూనె ఇతర వస్తువులు ములుగు ఎమ్మెల్యే సీతక్క తో కలిసి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పేద వాడి ఆకలి తీర్చడం కోసం ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇలానే ప్రతి ఒక్కరూ మానవత్వం తో ముందుకు రావాలని మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని సీతక్కఅన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: