మన్యం మనుగడ, మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిర్మాత జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా మణుగూరు మండలం లోని బాంబే కాలనీ సెంటర్ నందు ఉన్న జయశంకర్ సార్ విగ్రహం నకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎం.పి.టి.సి ల సంఘ0 ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు గారు అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టి.బి.జి. కె.యస్ మణుగూరు ఏరియా ఉపాధ్యక్షుడు ఊకంటి.ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ స్వరాష్ట్ర పోరాటానికి స్ఫూర్తి నిచ్చి తెలంగాణ భావ జాల వ్యాప్తి కోసం తన జీవితం ను అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి. జయశంకర్ గారూ వర్థంతి అని వారి సేవలను స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిచారు.
ఈ కార్యక్రమంలో గుడిపూడి. కోటేశ్వరరావు, టి.బి.జి. కె.యస్ నాయకులు కోటా. శ్రీనివాసరావు, భూర్గంపాడ్ మార్కెట్ కమిటీ సభ్యులు సకిని.బాబురావు, వార్డు మెంబర్ ఎలిబోయిన.సురేష్ ,కిరాణా మర్చంట్స్ నాయకులు పోట్రూ. రత్న సుధాకర్ ,ముస్లిం మైనార్టీ నాయకులు హాబీబ్ పాషా,కునవరం గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్ అంచ.వెంకట్రావు,వికలాంగుల సంఘం నాయకులు భాస్కర్, తదితరులు పాల్గొని ఘననివాళులు అర్పించారు.
Post A Comment: