కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యమా చారి
గుండాల జూన్ 28 (మన్యం టీవీ) రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యమా చారి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం పార్టీ కార్యకర్తలతో విలేకర్ల సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. రోజులుగా వేచి చూస్తున్న తరుణం ఆవిష్కృతమైంది అన్నారు. రేవంత్ రెడ్డి నీ పార్టీ గుర్తించి పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు. ఆయన నాయకత్వంలో ఆయన నాయకత్వంలో పార్టీలో సమిష్టిగా పనిచేసి పార్టీని విజయపథంలో నిలుపుతామని అన్నారు. పార్టీకి పూర్వ వైభవం తేవడంలో రేవంత్ రెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రావడం కాయం మన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సం పాపారావు , ఎంపీటీసీ కృష్ణారావు ఎంపీటీసీ కృష్ణారావు , పడుకోను గూడెం సర్పంచ్ జయసుధ శోభన్ బాబు , దుర్గ , వెంకటేశ్వర్లు , కృష్ణ , బొంబై నా ముత్తయ్య , వాంకుడోత్ రమేష్ , పాపారావు , సీతారాములు పాల్గొన్నారు
Post A Comment: