ఆర్టీసీ డి ఎం వెంకటేశ్వర్లు
గుండాల ఆళ్ల పల్లి జూన్ 16 ( మన్యం టీవీ) నేటి నుండి కొత్తగూడెం మర్కోడు బస్ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మర్కోడు పంచాయతీ లో గల నడిగూడెం రహదారిని ఆయన పరిశీలించారు. నడిగూడెం ,జాకారం, లొది గూడెం మీదుగా బస్సులు నడిపేందుకు రహదారిని పరిశీలించాము అన్నారు. గురువారం నుండి కొత్తగూడెం టు మర్కోడు బస్సులు నడుపుతామని అన్నారు. నిరంతరాయ బస్ సౌకర్యం ఉండాలంటే ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు , రాఘవాపురం సర్పంచ్ ప్రేమ కళ , వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య , తాటికొండ శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: