మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని 21 ఫీట్ ఏరియా కు చెందిన కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు కులాంతర వివాహం వేసుకున్న దంపతులు కోరారు. దళిత యువకుడు బిందె పవన్ కుమార్, గూజే నిహారిక గౌడ్ కొంతకాలం క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఇల్లందు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం నీహారిక కుటుంబ సభ్యులు గూజే భాగ్యలక్ష్మి గౌడ్, గోపగాని స్వరూప గౌడ్, ఇద్దరు కలిసి కులాంతర వివాహం చేసుకున్న జంటపై దాడి చేసి గాయ పరిచారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ రక్షణ కల్పించాలని దంపతులు కోరారు.
Post A Comment: