మన్యం మనుగడ, పినపాక :
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం నాడు జిల్లాలోని అధికారులందరికీ అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ప్రణాళిక కార్యక్రమాలను కేటాయించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా పినపాక మండలం లోని ఏడేళ్ల బయ్యారం నుండి కరకగూడెం వరకు అవెన్యూ ప్లాంటేషన్ కు రూట్ ఆఫీసర్ గా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి నియమించడం జరిగింది. శనివారం నాడు పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ను భూపాలపట్నం పంచాయతీ దగ్గర అవెన్యూ ప్లాంటేషన్ కు సంబంధించిన వివరాలను అడగగా, శ్రీనివాసులు దానికి సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి కి వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్ పక్కాగా అమలు జరగాలని పది మీటర్లు ఎత్తు గల మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భూపాలపట్నం పంచాయతీ సర్పంచ్ కృష్ణంరాజు, ఉపసర్పంచ్ నిట్ట వెంకటేశ్వర్లు, సెక్రటరీ సమ్మయ్య, బయ్యారం సెక్రటరీ హరీష్, టి ఎ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: