CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితుల "అన్నదాత"

Share it:

 



ప్రతి ఇంటికి ఆత్మీయ బంధువైన కంది సుబ్బారెడ్డి


మన్యం మనుగడ, పినపాక: 


పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి అంటేనే సహాయానికి పరాకాష్ట. కరోనా కష్టకాలంలో ఎంతో మంది కరోనా బాధితులకు ఆత్మీయ బంధువుగా ఉండి, మండలంలోని ప్రతి గ్రామానికి నిత్యావసరాలను, పినపాక , కరకగూడెం మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను ను అందించి "ప్రాణదాత" అయినాడు. అంతేకాకుండా కరోనా మహమ్మారి కారణంగా ఎవరైతే చనిపోతున్నారో, వారి దశదినకర్మ నిమిత్తం ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందిస్తూ "అన్నదాత" అవుతున్నాడు. సోమవారం రోజున పినపాక మండలంలోని అమరారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కలేటి ముసలమ్మ (80) కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందించి, ఆత్మ బంధువు అయినాడు. కంది సుబ్బారెడ్డి సేవాభావం పట్ల, ఎదుటి వారికి సహాయాన్ని అందించే మంచి గుణం పట్ల మండలంలోని ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమరవరం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, కలేటి ముసలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: