మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ సారపాక ప్రధాన రహదారి పై ఉన్నటువంటి దుకాణ సముదాయాల ముందు ఉన్న డ్రైనేజీలు ఎన్నో నెలలుగా క్లీనింగ్ చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. అందుకు సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా దుర్గంధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు క్లీన్ చేయించి సహకరించాలని పంచాయతీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
Post A Comment: