మన్యం మనుగడ, పినపాక:
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అర్హులైన వారికి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు చెక్కులను అందజేయడం జరిగింది. ఉప్పాక గ్రామానికి చెందిన ఇద్దరికీ, సీతం పేట గ్రామానికి చెందిన ఒకరికి ఈ చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఉప్పాక సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ రామారావు, సీతంపేట సర్పంచ్ శివ శంకర్, ఉపసర్పంచ్ నాగభూషణం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉడుముల రవీందర్ రెడ్డి , సంపత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: