మన్యం టీవీ,బూర్గంపాడు:
టేకులపల్లి కి చెందిన రాము లలిత లు భార్యాభర్తలు..
అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడు కృష్ణ తో కలిసి భర్త రాముని హతమార్చిన భార్య లలిత. మేకల వ్యాపారం కోసం అంటూ నమ్మించి బూర్గంపాడు మండలం పాతగొమ్మూరు కు తీసుకువచ్చి మద్యం తాగించి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇసుక ర్యాంపులో పూడ్చి పెట్టారు. అనంతరం టేకులపల్లి కి వెళ్ళిపోయారు. రాము ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో రాము తల్లిదండ్రులు టేకులపల్లి పోలీస్ స్టేషన్లులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన టేకులపల్లి పోలీసులు అసలు నిజాలను తేల్చి దోషుల పై కేసులు నమోదు చేశారు.
Post A Comment: