మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలం లోని చింత్రియాల గ్రామానికి చెందిన వెక్కటి సీతారామిరెడ్డి,మావోయిస్టు అజ్ఞాతంలో ఉంటున్న అతని తండ్రిని పరామర్శించి వారికి పండ్లు బట్టలు వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లో మణుగూరు ఏ ఎస్ పి శబరీష్ మాట్లాడుతూ బూజుపట్టిన మావోయిస్టు సిద్ధాంతాలను వదిలి జనజీవనంలో కలవాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను కని పెంచితే వృద్ధాప్యంలో ఉన్న వెక్కటి సత్యనారాయణ ను చూసుకునే వారు లేక మనోవేదనకు గురవుతున్నారని తల్లి సీతమ్మ కొడుకు రాక కోసం ఎదురు చూసి చూసి చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేశారు,
కరోన తో అనేకమంది అజ్ఞాతంలో ఉంటున్న మావోయిస్టులు చనిపోతున్నారని వారి ఆరోగ్యరీత్యా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని లొంగిపోయిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు, ఈ కార్యక్రమంలో అశ్వాపురం సీ ఐ సట్ల రాజు, చింత్రియాల కాలనీ ఉప సర్పంచ్ వెన్న అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: