మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు డివిజన్, పరిధిలోని మణుగూరు, పినపాక,కరకగూడెం,అశ్వాపురం పోలీస్ సిబ్బందికి మాస్కులు,సానిటేజర్లు పంపిణీ చేశారు.హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస రావు సౌజన్యంతో మణుగూరు ఏ ఎస్పీ శబరిష్ కు శానిటైజర్,మాస్కులు ఆందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి లో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలులో కీలక పాత్ర పోలీస్ వారిదే 24/7 విధినిర్వహణలో ఉంటూ లాక్ డౌన్ అమలను పగడ్బందీగా నిర్వహిస్తున్నారు.కరోనా మహమ్మారి కి ఎందరో మరణిస్తున్న విధినిర్వహణ లో తమ వారిని కోల్పోతున్న మొక్కవోని ధైర్యంతో పోలీస్ విధి నిర్వహణ నిర్వహిస్తున్నారు అని అన్నారు.జిల్లా వ్యాప్తంగా పోలీస్ వారికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయటానికి టిన్యూస్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏ ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు రెవిన్యూ సిబ్బందికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు సిఐ భాను ప్రకాష్,టిన్యూస్ రాపర్తి శ్రీహరి,తోట. రామకృష్ణ,జీ.నర్సింహ మూర్తి ఓదెలి పాల్గొన్నారు.
Post A Comment: